Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలల్లో తుపాకులు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (12:02 IST)
అమెరికాలో కాల్పుల సంస్కృతి హెచ్చుమీరిపోతోంది. కొందరు దుర్మార్గులు అత్యంత విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా, పాఠశాలల్లోని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరుపుతున్నారు. దీంతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ కోసం తుపాకులు ఇవ్వాలని అమెరికా ప్రభుత్వానికి స్కూలు సేఫ్టీ ప్యానెల్ సూచన చేసింది. స్కూళ్లలో కాల్పులు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. టీచర్లతో సహా సిబ్బందికి ఆయుధాలివ్వాలని, అనుభవజ్ఞులను గార్డులుగా నియమించుకోవాలని సలహా ఇచ్చింది. 
 
గతేడాది ఫిబ్రవరిలో ఫ్లోరిడాలోని పార్క్‌లాండ్‍లో మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయారు. దీంతో వెపన్స్ విచ్చల విడి అమ్మకాలను అరికట్టాలంటూ ఆందోళనలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెక్రెటరీ బెట్సీ దేవోస్‍ ఆధ్వర్యంలో ఫెడరల్‍ కమిషన్‍ ఆన్‍ సేఫ్టీప్యానెల్‍ను ఏర్పాటు చేసింది. స్కూల్‍ సేఫ్టీ ప్యానెల్‍ 180 పేజీల రిపోర్టును రూపొందించింది. 
 
తుపాకుల కొనుగోలుకు ప్రస్తుతం ఉన్న కనీస వయసును పెంచాలనే డిమాండ్‍ను తిరస్కరించింది. కాల్పులు జరిపిన వారిలో చాలా మంది కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ నుంచి తుపాకులు దొంగిలించిన వారేనని చెప్పింది. కాల్పులు జరిగిన సమయంలో చాకచక్యంగా, వేగంగా ఎదుర్కొనేందుకు టీచర్లకు, సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments