Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

అలా అన్నందుకు ప్రిన్సిపాల్‌నే చంపేశారు...

తల్లి, తండ్రి.. ఆ తర్వాత స్థానం గురువుదే. కానీ ఓ విద్యార్థి విద్యాబుద్ధులు చెబుతున్న గురువుపై రివాల్వర్‌తో కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నాడు. 'సరిగా చదవడం లేదు' అని అన్నందుకే ప్రిన్సిపాల్‌ను తుపాకీ

Advertiesment
Haryana
, ఆదివారం, 21 జనవరి 2018 (11:08 IST)
తల్లి, తండ్రి.. ఆ తర్వాత స్థానం గురువుదే. కానీ ఓ విద్యార్థి విద్యాబుద్ధులు చెబుతున్న గురువుపై రివాల్వర్‌తో కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నాడు. 'సరిగా చదవడం లేదు' అని అన్నందుకే ప్రిన్సిపాల్‌ను తుపాకీతో కాల్చి చంపేశారు. తన తండ్రి రివాల్వర్‌తో ఓ విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హర్యానా రాష్ట్రంలోని యమునానగర్‌లో స్వామి వివేకానంద పాఠశాల ఉంది. దీనికి స్థానికంగా మంచి పేరుంది. ఇక్కడ ఓ 18 యేళ్ల విద్యార్థి కామర్స్ విభాగంలో పన్నెండో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కు సక్రమంగా వెళ్లకపోవడమేకాకుండా సరిగా చదివేవాడు కాదు. పైగా, తోటి విద్యార్థులతో గొడవపడుతూ ఉండేవాడు.
 
దీంతో పాఠశాల ప్రిన్సిపాల్ రీతూచాబ్రా (47) అతడిని మందలించారు. విద్యార్థిలో మార్పురాకపోవడంతో 15 రోజులపాటు సస్పెండ్ చేశారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న ఆ విద్యార్థి శనివారం పాఠశాలకు వచ్చాడు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమావేశ మందిరంలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్న రీతూ వద్దకెళ్లి తన వెంట తెచ్చుకున్న 32 బోర్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. భుజం, ఛాతి, కడుపులోకి బుల్లెట్లు చొచ్చుకుపోయి ప్రిన్సిపాల్ రీతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న తల్లిదండ్రులు, స్థానికుల సాయంతో విద్యార్థిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబూల్‌లో మారణహోమం... ఉగ్రదాడిలో 35 మంది మృతి!