Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబూల్‌లో మారణహోమం... ఉగ్రదాడిలో 35 మంది మృతి!

అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మారణహోమం జరిగింది. ఉగ్రవాదులు జరిగిన దాడుల్లో 35 మందికి పైగా మృత్యువాతపడ్డారు. స్థానిక ఇంటర్‌ కాంటినెంటల్‌ లగ్జరీ హోటల్‌‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగింది.

Advertiesment
Kabul hotel attack
, ఆదివారం, 21 జనవరి 2018 (10:43 IST)
అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మారణహోమం జరిగింది. ఉగ్రవాదులు జరిగిన దాడుల్లో 35 మందికి పైగా మృత్యువాతపడ్డారు. స్థానిక ఇంటర్‌ కాంటినెంటల్‌ లగ్జరీ హోటల్‌‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగింది. 
 
శనివారం రాత్రి 9 గంటలకు నలుగురు సాయుధులు హోటల్‌లోకి ప్రవేశించారు. అత్యాధునిక ఆయుధాలతోపాటు రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రనేడ్లతో దాడి చేశారు. ముంబై ముట్టడి తరహాలో దానిని తమ ఆధీనంలోకి తీసుకుని విచ్చలవిడిగా కాల్పులు ప్రారంభించారు. కొంతమందిని చంపేశారు. పలువురిని బందీలుగా పట్టుకున్నారు. హోటల్‌లోని కొన్ని ఫ్లోర్లకు నిప్పు పెట్టారు. 
 
బహుళ అంతస్తుల హోటల్లో ఉగ్రవాదులు స్వైర విహారం చేస్తున్నారు. కాల్పులకు నాలుగో ఫ్లోర్లో ఉన్న కిచెన్‌ తగలబడింది. దాంతో ఆ అంతస్తు మొత్తానికి నిప్పంటుకుంది. కాల్పుల్లో 15 మంది వరకూ చనిపోయి ఉంటారని సన్‌ పత్రిక పేర్కొంది. మృతుల సంఖ్య 35 దాకా ఉంటుందని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా ప్రతినిధి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ ట్వీట్ : కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా యాత్ర