Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్ సరిహద్దు వద్ద మగబిడ్డకు జన్మనిచ్చిన పాకిస్థానీ మహిళ.. "బోర్డర్"

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (17:01 IST)
భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాకిస్థానీ మహిళ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో జన్మించిన కారణంగా.. బోర్డర్ అనే పేరు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. నింబు బాయి అనే మహిళ అట్టారి సరిహద్దు వద్ద మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
భర్త బలం రామ్‌తో కలిసి సరిహద్దు వద్ద గూడారంలో వుంటున్న ఆమెకు పురిటినొప్పులు రావడంతో.. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు బోర్డర్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. భార్య ప్రసవం కోసం పంజాబ్ పొరుగు ప్రాంతాలలోని మహిళల నుండి, ఇతర గ్రామస్థుల నుండి సహాయం పొందాడు. అంతేగాకుండా సరిహద్దుల వద్ద ఆ బిడ్డ పుట్టడంతో గూడారంలో వుంటున్న ప్రజలు పండుగ చేసుకున్నారు.  
 
ఇకపోతే.. 97 మంది పాకిస్తాన్ పౌరులు తీర్థయాత్ర, భారతదేశంలో నివసిస్తున్న తమ బంధువులను కలవడానికి భారతదేశాన్ని సందర్శించారు. అయితే తమ దేశంలోకి ప్రవేశించడానికి అవసరమైన పత్రాలు లేకపోవడం వల్ల పాకిస్తాన్‌కు తిరిగి చేరుకోలేకపోయారు. 
 
ఇలా అట్టారి సరిహద్దు దాటలేని ప్రజలందరూ అంతర్జాతీయ చెక్ పోస్ట్ సమీపంలోని గుడారంలో ఉంటున్నారు. వారికి అక్కడి స్థానికులు ఆహారం, వైద్య సదుపాయాలను అందిస్తారు. ఈ గూడారంలో వుంటున్న మహిళే మగబిడ్డను ప్రసవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments