Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత భయానకంగా లెబనాన్.. ఎక్కడ చూసినా మృతదేహాలు...

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (14:37 IST)
లెబనాన్‌ రాజధాని బీరూట్‌ అత్యంత భయానకంగా మారింది. నగరంలోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన భారీ పేలుళ్లతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో బీరూట్‌ మృత్యునగరాన్ని తలపించింది. ఈ ఘటనలో దాదాపు 137 మంది మరణించారు. నాలుగు వేల మందికిపైగా గాయపడ్డారు. 
 
శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. కాగా పోర్టు ప్రాంతంలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ వల్లే ఈ పేలుళ్లు జరిగాయని మంత్రి మొహమ్మద్‌ ఫామీ తెలిపారు.
 
2013లో అక్రమంగా రసాయనాలను తరలిస్తున్న ఓ కార్గో నౌకను అధికారులు సీజ్‌ చేసి ఓడలోని అమ్మోనియం నైట్రేట్‌, ఇతర రసాయనాలను గోదాముకు తరలించారు. అప్పటి నుంచి ఆ రసాయనాలు అక్కడే నిల్వ ఉన్నాయని ఫామీ వెల్లడించారు. గతంలో ఎన్నడూ చూడనటువంటి విపత్తును తాము ఎదుర్కొన్నామని లెబనాన్‌ ప్రధాని హసాన్‌ దియాబ్‌ తెలిపారు.
 
పేలుళ్లతో తీవ్రంగా దెబ్బతిన్న లెబనాన్‌ వంటి చిన్న దేశానికి మిత్ర దేశాలు సాయాన్ని అందించాలని ప్రధాని హసాన్ విజ్ఞప్తి చేశారు. లెబనాన్‌కు సాయాన్ని అందించేందుకు ఇప్పటికే రష్యా ముందుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments