Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

ఠాగూర్
సోమవారం, 16 జూన్ 2025 (13:39 IST)
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. దీంతో ఇరాన్ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, తమతమ గగనతలాన్ని మూసివేసింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత పౌరుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తాజాగా మరోసారి స్పందించింది.
 
ఇజ్రాయెల్‌లో భారతీయులందరూ సురక్షితంగానే ఉన్నారని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. భారత పౌరుల భద్రతే తమకు ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంది. వారికి అవసరమైన సహాయం అందించేందుకు 24 గంటల హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది.
 
ఇరాన్‌లో ఉంటున్న భారతీయ కుటుంబాలు, సంరక్షకులు, కార్మికులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులతో టెల్ అవీవ్‌లోని రాయబార కార్యాలయం నిరంతరం సంబంధాల్లో ఉందని తెలిపింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.
 
ఇరాన్‌ ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, గగనతలం మూసివేసినందున, భారత పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని, స్థానిక అధికారులు సూచించే భద్రతా ప్రమాణాలు పాటించాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments