Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gold: లక్ష రూపాయల మార్కును దాటిన పసిడి ధరలు- అదే బాటలో వెండి ధరలు

Advertiesment
gold and silver

సెల్వి

, శుక్రవారం, 13 జూన్ 2025 (21:24 IST)
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు భారీగా పెరిగి 10 గ్రాములకు లక్ష రూపాయల మార్కును దాటాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పసిడికి డిమాండ్‌ పెరుగుతోంది. ఎంసీఎక్స్ ప్రకారం బంగారం 10 గ్రాములకు రూ.1,108 లేదా 1.12 శాతం పెరిగి రూ.99,500 వద్ద ప్రారంభమైంది. 
 
ఇది మునుపటి ముగింపు రూ.98,392తో పోలిస్తే.. ప్రస్తుత ధర రూ.1,00,403కి పెరిగి మొదటిసారిగా రూ.1 లక్ష స్థాయిని అధిగమించింది.శుక్రవారం మధ్యాహ్నం 12:44 గంటలకు, బంగారం రూ.99,673.00 వద్ద ట్రేడవుతోంది. ఇది 1.30 శాతం పెరిగింది. అదనంగా, భారతదేశంలో రిటైల్ బంగారం ధరలు కూడా ఈ పెరుగుదలను ప్రతిబింబించాయి. 
 
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) డేటా ప్రకారం, మధ్యాహ్నం 12:50 గంటల ప్రాంతంలో, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.9,679గా ఉండగా, 24 క్యారెట్ల చక్కటి బంగారం గ్రాముకు రూ.9,917గా ఉంది.
 
వెండి కూడా ఇదే ట్రెండ్‌ను అనుసరించింది. కిలోకు రూ.565 లేదా రూ.1,06,450 వద్ద ప్రారంభమైంది. చివరి ముగింపు రూ.1,05,885 నుండి రూ.565 లేదా 0.53 శాతం పెరిగింది.
 
స్వల్పకాలంలో బంగారం ధరలు ప్రతిఘటనను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ సంఘటనలపై ఆధారపడి ఎంసీఎక్స్‌లో 10 గ్రాములకు రూ. 1,00,200, రూ. 1,00,500 మధ్య ఉండవచ్చు అని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరులో 5G వాణిజ్య సేవలను ప్రారంభించిన వోడాఫోన్ ఐడియా