సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

ఠాగూర్
బుధవారం, 30 జులై 2025 (12:53 IST)
రష్యా తూర్పు తీరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. ఇది రిక్టర్ స్కేలుపై 8.8గా నమోదైంది. కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రతను 8.8గా గుర్తించారు. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతో పాటు జపాన్, అమెరికా తీర ప్రాంతాలు సునామీ తాకిడికి గురయ్యాయి. 
 
ఈ భూకంపం ప్రభావం కారణంగా భారత్‌కు భారీ సునామీ ముప్పు పొంచివున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) స్పందించింది. భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పులేదని స్పష్టం చేసింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పులేదని తెలిపింది. ఈ మేరకు ఇన్‌కాయిస్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 
 
కంచట్కా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. అనంతరం సునామీ తాకింది. అయితే, దీని కారణంగా భారత్‌కు సునామీ ముప్పులేదు. హిందూ మహాసముద్ర తీవ్ర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పులేదు. అని ఇన్‌కాయిస్ తన పోస్టులో పేర్కొంది. కాగా, ఈ భూకంపం తర్వాత రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాల్లో సునామీ అలల ప్రభావం కనిపించింది. అమెరికా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. హవాయి ద్వీపంలోనూ అలెర్ట్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్కౌట్లు చేయడం వల్లే అలసిపోయా.. బాగానే ఉన్నాను : గోవిందా

Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల కెరీర్ గుర్తుగా రాజా సాబ్ స్పెషల్ పోస్టర్

Bad girl: బ్యాడ్ గర్ల్ అమ్మాయిలు చూడాల్సిన సినిమా.. శోభిత కితాబు

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments