Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి, సరఫరాలో చైనాను అధిగమించిన భారత్

Advertiesment
Apple

సెల్వి

, మంగళవారం, 29 జులై 2025 (21:35 IST)
Apple
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల అనిశ్చితి వ్యవహారాల మధ్య, ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తిని దూకుడుగా పెంచింది. దీంతో భారతదేశం తొలిసారిగా చైనాను అధిగమించి అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లను సరఫరా చేసే అగ్రగామిగా నిలిచింది. 
 
కెనాలిస్ పరిశోధన నివేదిక ప్రకారం, ఆపిల్ తన సరఫరా గొలుసును వైవిధ్యపరచడానికి, భారతదేశంలో ఐఫోన్ అసెంబ్లీని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్నందున, ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీలో ఒక ప్రధాన మార్పును సూచిస్తూ, ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో జూన్ త్రైమాసికంలో ఈ మైలురాయిని సాధించింది.
 
చైనాతో చర్చల అనిశ్చిత ఫలితం స్మార్ట్ ఫోన్ సరఫరా గొలుసు పునఃవ్యవస్థీకరణను వేగవంతం చేసిందని కెనాలిస్ ఈ నివేదిక తెలిపింది. Q2లో అమెరికా స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 1 శాతం పెరిగాయి.
 
అయితే, చైనాలో అసెంబుల్ చేయబడిన అమెరికా స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌ల వాటా ఏప్రిల్-జూన్ కాలంలో 25 శాతానికి పడిపోయింది. ఇది అంతకు ముందు సంవత్సరం ఇది 61 శాతంగా ఉంది. 
 
ఈ తగ్గుదలలో ఎక్కువ భాగం భారతదేశం తీసుకుంది. ఫలితంగా మేడ్-ఇన్-ఇండియా స్మార్ట్‌ఫోన్‌ల మొత్తం పరిమాణం సంవత్సరానికి 240 శాతం పెరిగింది. అంతేగాకుండా అమెరికాలోకి దిగుమతి చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌లలో 44 శాతం వాటా ఉంది. ఇది 2024 Q2లో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లలో కేవలం 13 శాతం మాత్రమేనని నివేదిక పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు