Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియాలో ప‌డ‌వ ప్ర‌మ‌దం... 57 మంది జ‌ల‌స‌మాధి!

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (11:02 IST)
లిబియాలో వలసదారులతో వెళుతున్న పడవ సముద్రంలో మునిగిపోవ‌డంపై ఆ దేశంలో తీవ్ర విచారం వ్య‌క్తం అవుతోంది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 57 మంది వ‌ల‌స‌దారులు జలసమాధి అయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 75 మంది వరకు ఉన్నట్టు అక్క‌డి అధికారులు చెబుతున్నారు.

మృతుల్లో 20 మందికి పైగా మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరందరూ మధ్యధ‌రా సముద్రం మీదుగా, మరింత మెరుగైన జీవనం కోసం ఐరోపాకు వెళ్తుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. పడవ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి సముద్రంలో నిలిచిపోయింది. ఆ తర్వాత స‌ముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి అల‌లు ఉప్పొంగ‌డంతో ఒక్కసారిగా మునిగిపోయింది.

ఈ ప్ర‌మాదంపై లిబియ‌న్ కోస్ట్ గార్డులు, యూరోపియ‌న్ అధారిటీపై మాన‌వ‌తావాదులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఒకేసారి వంద మంది జ‌ల‌స‌మాధికి కార‌ణ‌మ‌య్యార‌ని, స‌ముద్ర‌యానంపై క‌నీస జాగ్ర‌త్త‌లు లేవ‌ని విమ‌ర్శిస్తున్నారు. పొట్ట‌కూటి కోసం వ‌ల‌స పోతున్న కార్మిక కుటుంబాల‌ను న‌ట్టేట ముంచార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో 30 మంది వ‌ర‌కు బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డారు. లిబియ‌న్ క్యాపిట‌ల్ ట్రిపోలీకి వారు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments