Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ ఆదివాసీలకు కూడా కరోనా.. ఏడుగురికి పాజిటివ్

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (13:06 IST)
అమేజాన్ అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యానోమామి అనే తెగకు చెందిన ఈ ఆదివాసీల్లో ఏడుగురికి కరోనా కేసులు కన్ఫామ్ అయినట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా వెల్లడించారు.

బ్రెజిల్ అటవీ ప్రాంతాల్లో 300కి పైగా వివిధ తెగలకు చెందిన 18 లక్షల మంది నివసిస్తున్నారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న ఈ తెగల్లో యానోమామికి చెందిన 27 వేల మంది ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 
 
బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని ఈ తెగకు కరోనా సోకడం ఆశ్చర్యంగా వుందని లూయిజ్ హెన్రిక్ అన్నారు. వీరికే ఈ మహమ్మారి సోకిందంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని లూయజ్ వెల్లడించారు. 
 
యానోమామి తెగకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడికి ఈ వైరస్ సోకగా ఆసుపత్రిలో ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మొదట వారం రోజుల క్రితం 'కోకామా' తెగకు చెందిన 20ఏళ్ళ మహిళకు కరోనా సోకింది. బ్రెజిల్‌లో కూడా రోజురోజుకీ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments