Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ ఆదివాసీలకు కూడా కరోనా.. ఏడుగురికి పాజిటివ్

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (13:06 IST)
అమేజాన్ అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యానోమామి అనే తెగకు చెందిన ఈ ఆదివాసీల్లో ఏడుగురికి కరోనా కేసులు కన్ఫామ్ అయినట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా వెల్లడించారు.

బ్రెజిల్ అటవీ ప్రాంతాల్లో 300కి పైగా వివిధ తెగలకు చెందిన 18 లక్షల మంది నివసిస్తున్నారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న ఈ తెగల్లో యానోమామికి చెందిన 27 వేల మంది ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 
 
బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని ఈ తెగకు కరోనా సోకడం ఆశ్చర్యంగా వుందని లూయిజ్ హెన్రిక్ అన్నారు. వీరికే ఈ మహమ్మారి సోకిందంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని లూయజ్ వెల్లడించారు. 
 
యానోమామి తెగకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడికి ఈ వైరస్ సోకగా ఆసుపత్రిలో ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మొదట వారం రోజుల క్రితం 'కోకామా' తెగకు చెందిన 20ఏళ్ళ మహిళకు కరోనా సోకింది. బ్రెజిల్‌లో కూడా రోజురోజుకీ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం
Show comments