అమేజాన్ ఆదివాసీలకు కూడా కరోనా.. ఏడుగురికి పాజిటివ్

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (13:06 IST)
అమేజాన్ అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యానోమామి అనే తెగకు చెందిన ఈ ఆదివాసీల్లో ఏడుగురికి కరోనా కేసులు కన్ఫామ్ అయినట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా వెల్లడించారు.

బ్రెజిల్ అటవీ ప్రాంతాల్లో 300కి పైగా వివిధ తెగలకు చెందిన 18 లక్షల మంది నివసిస్తున్నారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న ఈ తెగల్లో యానోమామికి చెందిన 27 వేల మంది ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 
 
బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని ఈ తెగకు కరోనా సోకడం ఆశ్చర్యంగా వుందని లూయిజ్ హెన్రిక్ అన్నారు. వీరికే ఈ మహమ్మారి సోకిందంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని లూయజ్ వెల్లడించారు. 
 
యానోమామి తెగకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడికి ఈ వైరస్ సోకగా ఆసుపత్రిలో ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మొదట వారం రోజుల క్రితం 'కోకామా' తెగకు చెందిన 20ఏళ్ళ మహిళకు కరోనా సోకింది. బ్రెజిల్‌లో కూడా రోజురోజుకీ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

తర్వాతి కథనం
Show comments