Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటలు గంటలు కుర్చీలకే అతుక్కుపోతే.. పైల్స్ తప్పదండోయ్

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (15:25 IST)
గంటలు గంటలు కూర్చీలకే అతుక్కుపోతున్నారా.. అయితే పైల్స్‌ ముప్పు తప్పదని అంటూ హెచ్చరిస్తున్నారు.. వైద్యులు. అలా గంటల పాటు కూర్చుని పనిచేసే వారు ఆహారంలో పీచు అధికంగా వుండేలా చూసుకోవాలని.. వారు సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలను రోజూ డైట్‌లో చేర్చుకోవాలి. 
 
కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువగా పైల్స్ సమస్య బారిన పడుతుంటారు. అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు వంటి వాటితో మొలలు వస్తుంటాయి. నీరు తక్కువగా తాగడం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం వంటివి కూడా ఇందుకు కారణం అవుతాయి. 
 
పైల్స్ నివారణకు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంతేగాకుండా సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా ఉండే కూరగాయలు, ధాన్యాలు వంటివి పైల్స్ రోగాన్ని నిరోధిస్తాయి. వీటితో పాటు మామిడి, నిమ్మ, బొప్పాయి మొదలైన పండ్ల రసాలు రోజూ తాగాలి. 
 
నిమ్మ, బెర్రీలు, ఆపిల్స్, టమోటాలు మొదలైనవి పైల్స్ నివారణకు ఉపయోగపడతాయి. అంజీర పండును రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే పైల్స్ వ్యాధి నయమైపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments