Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం నీరు తాగకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (14:15 IST)
సాధారణంగా చాలామందికి చలికాలంలో నీళ్లు అంతగా తాగాలనిపించదు. కానీ, వైద్యులేమో ఇలా చేయడం మంచిది కాదంటున్నారు. నీళ్లు సరిగ్గా తాగకపోతే అనారోగ్యాల పాలవుతారని చెప్తున్నారు. కాస్త నీరసంగా అనిపిస్తే చాలు.. కాఫీలో లేదా టీ తాగుతుంటారు. ఈ రెండింటిని తీసుకోవడం కంటే గ్లాస్ నీటిని తాగడం మంచిదంటున్నారు వైద్యులు. ఒకవేళ నీటిని తీసుకోకపోతే ఏర్పడే సమస్యలేంటో చూద్దాం...
 
1. మనసంతా ఆందోళనగా, ఏదో భయం భయంగా ఉంటుంది. ఈ భయంతో తలనొప్పి తీవ్రంగా మారుతుంది. దాంతో శరీరమంతా నీరసం, నొప్పులకు గురవుతుంది. ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే.. శరీరంలో నీరు లేకపోవడమే ఇందుకు కారణం. కనుక క్రమంగా రోజూ నీరు తాగండి ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోండి.
 
2. కొందరైతే కాస్త నీరసంగా, ఒత్తిడిగా అనిపిస్తే చాలు.. వెంటనే కిచెన్‌కి వెళ్లి కాఫీలో లేదో టీ తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ, మన శరీరంలో ఇలాంటి సమస్యలు దేని కారణంగా వచ్చాయో.. దాంతోనే ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బందులనైన ఎదుర్కోవచ్చును.
 
3. శరీరం డిహైడ్రేషన్‌కి గురైనప్పుడు కడుపులో ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయం వెంటనే భోజనం చేయకుండా.. గ్లాస్ చల్లని నీరు తీసుకుంటే ఫలితం ఉంటుంది. కాసేపటి తరువాత మీకే అర్థమవుతుంది. ఆ ఆకలి నిజమైనదో కాదో..
 
4. చాలామంది భోజనం చేశాక నీళ్లు అంతగా తీసుకోరు. ఇలా చేస్తే తిన్న ఆహారం జీర్ణం కాదు. దీని ఫలితంగా మలబద్ధకం ఎదురుకావొచ్చు. ఈ సమస్య పెద్దదై కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. కనుక భోజనాంతరం తప్పక నీరు అధిక మోతాదులో తీసుకోండి.. ఎలాంటి సమస్యలు దరిచేరవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments