Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో గుల్లగుల్ల, కోవిడ్ తర్వాత న్యుమోనియాతో బాధపడుతున్న రోగులు

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (09:12 IST)
కరోనావైరస్ శరీరం నుంచి వదిలిపెట్టి వెళ్లిపోయినా ఆలోపు గుల్లగుల్ల చేసేస్తోంది. కరోనావైరస్ కాలంలో మ్యూకోర్మైకోసిస్, న్యుమోనియా వంటి పోస్ట్-కోవిడ్ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. కరోనా నుంచి బయట పడిన తర్వాత రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనితో న్యుమోనియా తలెత్తుతోంది. ఇది చాలా ప్రమాదకరమైనది, ముఖ్యంగా వృద్ధుల విషయంలో ఇది ప్రమాదకరంగా మారుతోంది.

 
వైద్య నిపుణులు వెల్లడించిన దాని ప్రకారం... కోవిడ్ తర్వాత న్యుమోనియా రెండవ అత్యంత సాధారణ సమస్యగా మారుతోంది. కరోనరీ హార్ట్ డిసీజ్ తర్వాత న్యుమోనియా ఉంటే దానిని విస్మరించకూడదంటున్నారు. కరోనా తర్వాత దేశంలో ఫంగల్ న్యుమోనియా రోగుల సంఖ్య వేగంగా పెరిగింది.

 
ఈ న్యుమోనియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కి కారణమవుతోంది. ఇది పరీక్షలలో స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అనేక మంది మరణాలలో తీవ్రమైన న్యుమోనియా కూడా కారణంగా తేలింది. అదే సమయంలో న్యుమోనియా, సెప్సిస్ ఒక వ్యాధి. రోగికి సెప్సిస్ ఉంటే అది న్యుమోనియాను మరింత ప్రమాదకరంగా మారుస్తుంది.

 
30% వరకు మరణాలు న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరినవారిలో 5 నుండి 10 శాతం మందిని చంపగలదని వైద్యులు చెపుతున్నారు. తీవ్రమైన రోగులను ఐసియులో ఉంచి చికిత్స అందించాలి. ఎందుకంటే న్యూమోనియా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య 30% వరకు వుంటోంది. రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థ ఈ వ్యాధికి తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అందుకే వృద్ధులలో న్యుమోనియా ప్రమాదకరం.

 
వృద్ధులలో రోగనిరోధక శక్తి అంతగా ఉండదు. చాలాసార్లు వ్యాధి సోకినప్పుడు మందులు ఇస్తారు, అవి వ్యాధితో పోరాడుతాయి. అయితే వ్యాధితో పోరాడటానికి శరీరంలో అవసరమైన రోగనిరోధక శక్తి కూడా చాలా ముఖ్యం. మందులు వ్యాధితో పోరాడటానికి సహాయపడతాయి. అయితే దానికి కూడా శరీరం తోడు కావాలి. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు శరీరం దానికి తగిన విధంగా స్పందించదు. ఫలితంగా శరీరంలో సంబంధిత వ్యాధులు ప్రబలుతాయి. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు.

 
కరోనా తర్వాత, అనేక అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉంది. దీనిని సాధారణంగా న్యుమోనియా అంటారు. దీని అర్థం కొరోనరీ హార్ట్ డిసీజ్ యొక్క తదుపరి అత్యంత తీవ్రమైన రూపం న్యుమోనియా. దీని వల్ల ఊపిరితిత్తులకు చాలా నష్టం వాటిల్లుతుంది. అటువంటి సందర్భాలలో రికవరీ చాలా నెలలు పట్టవచ్చు.

 
ఒక వ్యక్తి దగ్గుతో పసుపుపచ్చ కళ్లె పడుతున్నప్పుడు, అధిక జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న సందర్భంలో న్యుమోనియా వచ్చినట్లు అనుమానించక తప్పదు. ఈ సందర్భంలో రోగి ఛాతీకి ఒక వైపు లేదా రెండు వైపులా నొప్పిని అనుభవించవచ్చు. కొన్నిసార్లు అధిక జ్వరం ఉండదు కానీ రెండు ఇతర లక్షణాలు ఉండే అవకాశం వుంది. న్యూమోనియా ఊపిరితిత్తులు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

తర్వాతి కథనం
Show comments