యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?

ఠాగూర్
ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (10:23 IST)
విశాఖపట్టణంలోని ఫార్మాసిటీలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని నగ్నంగా వీడియో తీసిన ఓ యువకుడు అంతలోనే శవమయ్యాడు. యువకుడిని గదిలో నిర్బంధించి అతని తల్లిదండ్రులకు కబురు పెట్టారు. తల్లిదండ్రులు వస్తే తన పరువు పోతుందని భావించిన ఆ యువకుడు.. కేబుల్ వైరుతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. 
 
విజయనగరం జిల్లా ఫూల్‌బాగ్ కాలనీకి చెందిన గొందేటి భాస్కర రావు (30) అనే వ్యక్తి విశాఖ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయన గాజువాక సమీపంలోని శ్రీరాంనగర్‌లో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. శనివారం ఉదయం పక్కింటి అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు భాస్కర రావుతో గొడవకు దిగి, వీడియోను డిలీట్ చేయించారు. 
 
అయితే, అంతటితో వారు ఆగకుండా భాస్కర రావును ఇంట్లోనే బంధించి, విజయనగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి చూసి హతాశులయ్యారు. సీలింగ్ ఫ్యానుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డ ముఖంపై గాయాలు కూడా ఉన్నాయని, తమ కుమారుడుని కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments