Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (11:11 IST)
చెన్నై మహానగరంలో దారుణం జరిగింది. ఓ టీవీ యాంకర్ అత్యాచారానికి గురైంది. నిద్ర మాత్రలు కలిపిన జ్యూస్ ఇవ్వడంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత ఆమెపై ఓ పూజారి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ యాంకర్ గర్భందాల్చింది. తాజాగా చెన్నై సాలిగ్రామం ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నెలోని ప్రధాన అమ్మన్ ఆలయాల్లో ఒక ఆలయంలో కార్తీక్ మునుస్వామి పూజారిగా ఉన్నారు. ఈయన చేతిలో తాను అత్యాచారానికి గురైనట్టు ఆ యాంకర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఆధ్యాత్మిక వ్యక్తినని, తరచుగా ఆలయాలను సందర్శిస్తుంటానని తెలిపింది. 
 
చెన్నైలోని ప్యారీస్ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ కాళికంపాల్ ఆలయానికి తరచుగా వెళ్తుంటానని... ఈ క్రమంలో తనకు ఆలయ పూజారి కార్తీక్ మునిస్వామితో పరిచయం ఏర్పడిందని తెలిపింది. ఈ స్నేహంతో తాను గుడికి వచ్చినప్పుడల్లా గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక దర్శనం చేయించేవాడని చెప్పింది.
 
ఈ క్రమంలో తమకు స్నేహం పెరిగిందని... ఒకరోజు తాను గుడికి వచ్చినప్పుడు తన బెంజ్ కారులో డ్రాప్ చేస్తానని చెప్పాడని... కారులో ప్రయాణిస్తుండగా తీర్థం ఇచ్చాడని, దీన్ని తాగిన తర్వాత తనకు స్పృహ తప్పిందని ఆమె తెలిపింది. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని చెప్పింది. 
 
ఇది జరిగిన తర్వాత తనను గుడిలోనే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని... ఆ తర్వాత చాలాసార్లు తమ ఇంటికి వచ్చాడని, తాను గర్భవతిని అయ్యానని తెలిపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించాడని... ఆ తర్వాత తనను వ్యభిచారం చేయమని బలవంతం చేశాడని పేర్కొంది.
 
ఆమె ఫిర్యాదుతో పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలను అతని ఫోన్ నుంచి పోలీసులు రికవరీ చేశారు. ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన బాధితురాలు చెన్నైకి చెందిన ఓ టీవీ ఛానల్‌లో పని చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

తర్వాతి కథనం
Show comments