Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2024 : రాజస్థాన్ రాయల్స్‌పై సీఎస్కే విజయం

Advertiesment
chennai super kings
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఆదివారం సాయంత్రం సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సీఎస్కే జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ జట్టు నిర్ధేశించిన 141 పరుగుల వియలక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్కే జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆర్ఆర్ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. 
 
జైస్వాల్ 24, బట్లర్ 21, శాంసన్ 15 చొప్పున పగులు చేశారు. ఈ మూడు వికెట్లను సిమర్జీత్ సింగ్ ఖాతాలో చేరాయి. రియాన్ పరాగ్ 47 పరుగులు చేయగా, ధృవ్ జురెల్ 28 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో సిమర్జిత్ సింగ్ 3, తుషార్ 2 చొప్పున వికెట్లు తీశారు. సీఎస్కే బౌలర్లు పక్కా ప్లాన్‌తో బంతులు వేయడంతో ఆర్ఆర్ జట్టు బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. 
 
ఆ తర్వాత 142 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే జట్టు... 18.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఈ జట్టులో రవీంద్ర 27, గైక్వాడ్ 42 (నాటౌట్), మిచెల్ 22, అలీ 10, శివం దుబే 18, రవీంద్ర జడేజా 5, రిజ్వి 15(నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఆర్ఆర్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీయగా, బర్గర్, చావల్‌లు ఒక్కో వికెట్ తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2024 : ఢిల్లీ జట్టు సారథి రిషభ్ పంత్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్