Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

ఠాగూర్
సోమవారం, 16 జూన్ 2025 (16:44 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మోడల్ గొంతుకోసి హత్య చేసిన దుండగులు.. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలోపడేశారు. సోనిపట్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా సంచలనం కలిగించిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే,
 
స్థానికంగా ఉండే ఓ మ్యూజిక్ కంపెనీలో మోడల్‌గా శీతల్ అనే యువతి పని చేస్తుంది. ఆమె కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా సోనిపట్‌లోని కుండా గ్రామ సమీపంలోని ఓ నీటి కాలువలో మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో శీతల్‌ను గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేసినట్టు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, శీతల్‌ను హత్య చేయడానికి గల కారణాలు తెలియరాలేదు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
అలాగే, పంజాబ్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కంచన్ కుమారి (30) కూడా ఇలాగే హత్యకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. బఠిండా జిల్లాలోని ఆదేశ్ వర్శిటీ పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసివున్న కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments