Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

Advertiesment
deadbody

ఠాగూర్

, ఆదివారం, 15 జూన్ 2025 (12:27 IST)
హైదరాబాద్ నగరంలోని చింతల్‌కుంట వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌కుంట ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై ఈ విద్యుత్ వైర్లు తెగిపడటంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
చింతల్‌కుంటలోని ప్రధాన రహదారి పక్కనున్న ఫుట్‌పాత్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నిద్రిస్తుంగా, ఆదివారం వేకువజామున సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి హైటెన్షన్ విద్యుత్ తీగలు భారీ శబ్దంతో వారిపై తెగిపడి, క్షణాల్లో మంటలు అంటుకున్నారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు మంటల్లోనే కాలిపోయారు. 
 
సమాచారం. అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు, విద్యుత్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు వారు యాచకులై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అలాగే, విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...