Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

Advertiesment
Ahmedabad Air India Plane Crash

ఠాగూర్

, ఆదివారం, 15 జూన్ 2025 (11:37 IST)
ఇటీవల అహ్మదాబాద్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో వడోదరాకు చెందిన యాస్మిన్ వోరా (51), ఆమె మేనల్లుడు పర్వేజ్ వోరా (30), ఆయన నాలుగేళ్ళ కుమార్తె జువేరియాలు ఉన్నారు. ఈ వార్త వారి కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
 
యాస్మిన్ వోరాకు వాస్తవానికి జూన్ 9వ తేదీనే లండన్‌కు ప్రయాణం కావాల్సివుంది. అయితే థాస్రాకు చెందిన తన మేనల్లుడు పర్వేజ్, అతని కుమార్తె జువేరియాతో కలిసి ప్రయాణించేందుకు ఆమె తన ప్రయాణ టిక్కెట్‌ను 12వ తేదీకి మార్చుకుని, చివరకు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని తలచకుని యాస్మిన్ భర్త బోరున విలపిస్తున్నాడు. 
 
పైగా, ప్రమాదం జరిగిన రోజున యాస్మిన్‌ను ఆమె భర్త యాసిన్ స్వయంగా విమానాశ్రయంలో వదిలిపెట్టారు. విమానం టేకాఫ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు యాస్మిన్ తన భర్త యాసిన్‌కు ఫోన్ చేసి విమానంలో ఏసీ సరిగ్గా పని చేయడం లేదని, తనకు ఏదో తెలియని ఆందోళనగా, అదోలా అనిపిస్తోందని చెప్పినట్టు యాసిన్ గుర్తుచేసుకున్నారు. అలాంటిదేమీ ఉండదు. కాసేపటికి ఏసీ ఆన్ అవుతుంది. అని నేను ఆమెకు ధైర్యం చెప్పాను అని ఆయన తన భార్యతో జరిగిన చివరి సంభాషణ తలచకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ