Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Advertiesment
Pawan Kalyan

ఠాగూర్

, శుక్రవారం, 13 జూన్ 2025 (22:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం పటాన్‌చెరులో ప్రత్యక్షమయ్యారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే పటాన్‌చెరులో ప్రఖ్యాత ఇక్రిశాట్ క్యాంపస్‌లోని ఇంటర్నేషల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ఐఎస్‌హెచ్) ఉంది. ఇక్కడకు పవన్ వెళ్లడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారడంతో పాటు ఆ స్కూల్ పేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అడ్మిషన్ కోసం ఈ స్కూల్‌లో పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
కాగా, ఈ పాఠశాలలో అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే, అక్కడి సౌకర్యాలను కూడా పరిశీలించారని సమాచారం. కాగా, పవన్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో విద్యాభ్యాసం చేస్తూ వచ్చాడు. ఈ పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించడంతో మార్క్ గాయపడిన విషయం తెల్సిందే. ఈ సంఘటన నేపథ్యంలోనే కుమారుడు చదువు కోసం హైదరాబాద్ నగరంలో ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులోభాగంగానే ఆయన పటాన్‌చెరులోని ఐఎస్‌హెచ్‌ను ఆయన సందర్శించి ఉంటారని భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్