కోహ్లీ, ధోనీ లేని జట్టా? ఐసీసీపై గుర్రుగా వున్న భారత క్రికెట్ ఫ్యాన్స్

Webdunia
బుధవారం, 17 జులై 2019 (11:48 IST)
2019 ప్రపంచ కప్ అత్యాంత వివాదాస్పదమైనదనే విమర్శలను ఎదుర్కొంటోంది. తొలుత వర్షం.. ఆ తర్వాత అంపైర్ల పేలవ నిర్ణయాలు.. చివరికి ఫైనల్ ఫలితం. వివాదాలతోనే ముగిసింది ఈ ప్రపంచకప్ సమరం. ఇప్పటికే ఐసీసీపై క్రికెట్ ఫ్యాన్స్ గుర్రుగా వున్నారు. ఈ ప్రపంచ కప్‌లో హీరోలుగా నిలిచిన వారితో ఐసీసీ ఓ జట్టును తయారు చేసి మళ్లీ భారత ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. 
 
దేశంతో సంబంధం లేకుండా తయారు చేసిన ఈ జట్టులో భారత్ నుంచి ఇద్దరికి చోటు లభించింది. అందులో రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఉన్నారు. విశేషమేమిటంటే.. ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కలేదు.
 
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఐసీసీ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ ఎంపికవగా, 12వ ఆటగాడిగా న్యూజిలాండ్‌కు చెందిన బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఇంగ్లండ్ నుంచి నలుగురు ఆటగాళ్లు ఎంపికవడం విశేషం. 
 
ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు, న్యూజిలాండ్ నుంచి ముగ్గురు, బంగ్లాదేశ్ నుంచి షకీబ్ అల్ హసన్ ఉన్నారు. ఇక, కోహ్లీ జట్టులో లేకపోవడంపై అభిమానులు ఐసీసీపై గుర్రుగా వున్నారు. అసలు ఐసీసీకి ఏమైంది అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments