Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే ప్రపంచ కప్‌తో ఓవర్.. సచిన్ తరహాలో ధోనీ రిటైర్మెంట్?

Webdunia
బుధవారం, 3 జులై 2019 (18:20 IST)
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ మెగా టోర్నీతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీమిండియాకు పలు ట్రోఫీలు సంపాదించి పెట్టిన మాజీ కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన ధోనీపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ధోనీ బ్యాటింగ్‌పై ఇప్పటికే మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లు విమర్శలు గుప్పించారు. అయితే ఈ విమర్శలను పక్కనబెట్టి ధోనీ తన పని తాను చేసుకుపోతున్నాడు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. ధోనీ తన ఫ్యాన్స్ మద్దతుతో దూసుకుపోతున్నాడు.  
 
ధోనీపై విమర్శలే కాకుండా.. ఆతని రిటైర్మెంట్‌పై కూడా వార్తలు అప్పుడప్పుడూ వస్తూనే వున్నాయి. ప్రస్తుతం ఓ ఆంగ్ల మీడియా సంస్థ ధోనీ రిటైర్మెంట్‌పై వార్తను ప్రచురించింది. ఆ వార్తలో ధోనీ ప్రపంచ కప్‌తో వన్డేలకు స్వస్తి చెప్తాడని సదరు సంస్థ ప్రకటించింది. ధోనీకి వన్డే వరల్డ్ కప్ 2019తోనే సరిపెట్టుకుంటాడని తెలిపింది. 
 
కానీ రిటైర్మెంట్‌కు సంబంధించి ధోనీ నుంచి కానీ బీసీసీఐ నుంచి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తరహాలో ధోనీ కూడా ప్రపంచ కప్ తర్వాత వన్డేలకు రాం రాం అంటారని.. తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments