Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యానికి బానిసయ్యాను.. పిస్టల్‌తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా: ప్రవీణ్ కుమార్

Webdunia
గురువారం, 23 జనవరి 2020 (11:02 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మానసిక ఒత్తిడి కారణంగా పిస్టల్‌‍తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపాడు. గత 2007వ సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ అరంగేట్రం చేసిన ప్రవీణ్ కుమార్.. ఆపై జట్టులో స్థానం దక్కకపోవడంతో ఒత్తిడికి గురయ్యాడు. అటు పిమ్మట క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. తన ప్రతిభకు మంచి గుర్తింపు లభించలేదన్నాడు. తాను నిరాశకు చెందానని.. ఒంటరిగా వున్నప్పుడు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు. అలా మద్యానికి కూడా బానిస అయ్యానని చెప్పాడు. అలా ఓ రోజు రాత్రి పిస్టల్‌తో ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అయితే తన పిల్లల ముఖాన్ని చూసి ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గానని ప్రవీణ్ కుమార్ చెప్పాడు. కానీ మద్యానికి ప్రస్తుతం బానిస కానని చెప్పాడు. ప్రస్తుతానికి ఒత్తిడి నుంచి ఆమడ దూరానికి వచ్చేశానని తెలిపాడు. 
 
కాగా.. భారత జట్టుకోసం ఆడిన ప్రవీణ్ కుమార్.. 68 వన్డేల్లో ఆడాడు. 77 వికెట్లు పడగొట్టాడు. ఆరు టెస్టుల్లో ఆడి 27 వికెట్లను సాధించాడు. చివరికి 2012వ సంవత్సరం పాకిస్థాన్ జట్టులో ఆడాడు. ఆ తర్వాత క్రికెట్‌కు దూరమై 2018వ సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించాడు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

తర్వాతి కథనం
Show comments