Webdunia - Bharat's app for daily news and videos

Install App

#కోచ్‌గా మారిన టెండూల్కర్.. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం..?

Webdunia
బుధవారం, 22 జనవరి 2020 (13:15 IST)
క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొత్త అవతారం ఎత్తాడు. ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తోంది.  'బుష్ ఫైర్ క్రికెట్ బ్యాష్' పేరుతో నిర్వహిస్తున్న ఈ ఛారిటీ మ్యాచ్ కు నేను సైతం అంటూ ప్రపంచవ్యాప్తంగా పలు క్రికెటర్లు ముందుకొచ్చారు. పాంటింగ్ ఎలెవెన్, షేన్ వార్న్ ఎలెవన్ మధ్య ఫిబ్రవరి 8న  మ్యాచ్ జరగనుంది. 
 
ఈ మ్యాచ్‌తో సచిన్ టెండూల్కర్  మైదానంలోకి దిగుతున్నారు. సచిన్ పాంటింగ్ ఎలెవన్ జట్టుతో చేరారు. కానీ క్రికెట్ ఆడడానికి కాదు. పాంటింగ్ ఎలెవెన్ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కోట్నీ వాల్ష్ .. షేన్ వార్న్ ఎలెవన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. 
 
ఈ మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికీ పాంటింగ్, బ్రెట్ లీ, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్ వెల్, మైఖెల్ క్లార్క్, స్టీవ్ వా, మెల్ జోన్స్, షేన్ వార్న్, జస్టిన్ లాంగర్, ఆడమ్ గిల్ క్రిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 8న జరిగే మ్యాచ్ కోసం స్టేడియం సిద్ధం కానుంది. నిజానికి ఈ మ్యాచ్ ను ఓవల్ స్టేడియంలో నిర్వహించాలని భావించారు. కానీ అదే రోజు భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య టీ-20 మ్యాచ్ ఉంది. మరి ఛారిటీ మ్యాచ్‌కు ఏ స్టేడియం ముస్తాబవుతుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

తర్వాతి కథనం
Show comments