Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ.. ధోనీ.. అని అరిచిన ఫ్యాన్స్.. గుర్రుగా చూసిన కోహ్లీ.. (video)

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (17:22 IST)
టీమిండియాకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ధోనీకి తర్వాత వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ను రంగంలోకి దించింది. అయితే ధోనీ స్థాయికి రిషబ్ పంత్ రాణించలేకపోతున్నాడు. ఒక్కో మ్యాచ్‌లో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్‌లో తేలిపోతున్నాడు. 
 
అంతేగాకుండా రిషబ్ పంత్ మైదానంలో వున్నంత సేపు.. క్రికెట్ ఫ్యాన్స్ ధోనీ.. ధోనీ అని అరుస్తున్నారు. ఇలా చేయడం ఇతర క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్లు అవుతుందనే ఉద్దేశంతో అలా కేకలు వేయకండని ఫ్యాన్సుకు కోరుతున్నాడు విరాట్ కోహ్లీ. 
 
ఇలాంటి సీనే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఆసీస్‌తో జరిగిన చివరి రెండు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగాడు. రిషబ్ పంత్‌ కంటే ఇతను మెరుగ్గా రాణించాడు. అయినా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌కు కుల్దీప్ యాదవ్ విసిరిన బంతి.. బ్యాటును తాకి పక్కకుపోయింది. ఈ బంతిని రాహుల్ చేజార్చుకున్నాడు. 
 
వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ ధోనీ.. ధోనీ.. అంటూ అరవడం మొదలెట్టారు. ఆ శబ్ధాన్ని విని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వైపు గుర్రుగా చూశాడు. అంతే ఫ్యాన్స్ అలా అరవడం ఆపేశారు. వెంటనే రాహుల్.. రాహుల్ అంటూ అరిచారు. దీంతో వికెట్ కీపర్‌గా రాహుల్ కొనసాగించాలని కోహ్లీకి చాలామంది సీనియర్ క్రికెటర్లు కోరుకుంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments