Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణె టెస్ట్ : కోహ్లీ వీరవిహారం... టెస్టుల్లో 26వ సెంచరీ

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (13:08 IST)
పూణె వేదికగా పర్యాటక సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. ఫలితంగా తన కెరీర్‌లో 26వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 2019లో కోహ్లీ టెస్టుల్లో చేసిన తొలి సెంచరీ ఇదే కావడం గమనార్హం. అలాగే, ఒక కెప్టెన్‌గా 40 సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
 
మరో ఎండ్‌లో అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ కోహ్లీకి అండగా నిలిచాడు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు. కోహ్లీ 104 పరుగులతో, రహానే 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
దీనికి ముందు మయాంక్ 108, రోహిత్ శర్మ 14, పుజారా 58 ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూడు వికెట్లను రబాడా తీశాడు. కోహ్లీ, రహానేల జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 
 
కాగా, విశాఖపట్టణం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అలాగే, ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పాయింట్ల పరంగా భారత్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments