Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణె టెస్ట్ : కోహ్లీ వీరవిహారం... టెస్టుల్లో 26వ సెంచరీ

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (13:08 IST)
పూణె వేదికగా పర్యాటక సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. ఫలితంగా తన కెరీర్‌లో 26వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 2019లో కోహ్లీ టెస్టుల్లో చేసిన తొలి సెంచరీ ఇదే కావడం గమనార్హం. అలాగే, ఒక కెప్టెన్‌గా 40 సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
 
మరో ఎండ్‌లో అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ కోహ్లీకి అండగా నిలిచాడు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు. కోహ్లీ 104 పరుగులతో, రహానే 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
దీనికి ముందు మయాంక్ 108, రోహిత్ శర్మ 14, పుజారా 58 ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూడు వికెట్లను రబాడా తీశాడు. కోహ్లీ, రహానేల జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 
 
కాగా, విశాఖపట్టణం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అలాగే, ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పాయింట్ల పరంగా భారత్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments