Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణె టెస్ట్ : కోహ్లీ వీరవిహారం... టెస్టుల్లో 26వ సెంచరీ

Webdunia
శుక్రవారం, 11 అక్టోబరు 2019 (13:08 IST)
పూణె వేదికగా పర్యాటక సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. ఫలితంగా తన కెరీర్‌లో 26వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 2019లో కోహ్లీ టెస్టుల్లో చేసిన తొలి సెంచరీ ఇదే కావడం గమనార్హం. అలాగే, ఒక కెప్టెన్‌గా 40 సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
 
మరో ఎండ్‌లో అజింక్యా రహానే నిలకడగా ఆడుతూ కోహ్లీకి అండగా నిలిచాడు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు. కోహ్లీ 104 పరుగులతో, రహానే 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
దీనికి ముందు మయాంక్ 108, రోహిత్ శర్మ 14, పుజారా 58 ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూడు వికెట్లను రబాడా తీశాడు. కోహ్లీ, రహానేల జోరుతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 
 
కాగా, విశాఖపట్టణం వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అలాగే, ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పాయింట్ల పరంగా భారత్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పొరిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తర్వాతి కథనం
Show comments