Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థాయ్‌లాండ్‌లో చనిపోయిన ఇండియన్ టెక్కీ

థాయ్‌లాండ్‌లో చనిపోయిన ఇండియన్ టెక్కీ
, శుక్రవారం, 11 అక్టోబరు 2019 (11:05 IST)
థాయ్‌లాండ్‌లో ఓ భారతీయ టెక్కీ దుర్మరణం చెందారు. ఆమె పేరు ప్రజ్ఞ (29). స్థానికంగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె మృత్యువాతపడ్డారు. బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నా ఆమె... హాంగ్ కాంగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఫుకెట్‌లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్‌లోని ఓ ఆసుపత్రి మార్చురీలో ఉంది. పజ్ఞ కుటుంబం మధ్యప్రదేశ్ ఛత్తార్ పూర్ జిల్లాలో నివసిస్తోంది. ప్రజ్ఞ మరణించిన విషయాన్ని బెంగళూరులో ఉన్న ఆమె రూమ్మేట్‌కు థాయిలాండ్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె రూమ్మేట్ ప్రగ్న కుటుంబసభ్యులకు తెలిపారు. తమ కూతురు చనిపోయిందన్న వార్తతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా వివరించారు. 
 
బ్యాంకాంగ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ప్రగ్న కుటుంబీకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, థాయిలాండ్‌లో ఉన్న మన ఎంబసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఆమె కుటుంబీకులకు వెంటనే పాస్ పోర్టును ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా భద్రతా సిబ్బంది ఆధీనంలో చెన్నై ఎయిర్‌పోర్టు