Webdunia - Bharat's app for daily news and videos

Install App

2027 ప్రపంచ కప్‌కు దూరంగా ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు : గవాస్కర్

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (15:15 IST)
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో 2027లో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. కోహ్లీ, రోహిత్ శర్మలిద్దరూ వచ్చే 2027లో జరిగే ప్రపంచ కప్ ఆడరని జోస్యం చెప్పారు. ఈ ఇద్దరు క్రికెటర్లకు ఇది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.  
 
రోహిత్, కోహ్లీ వన్డేల్లో అద్భుతంగా ఆడతారు. 2027 వరల్డ్ కప్ విషయానికి వస్తే, అప్పటికీ వీరిద్దరిలో ఇప్పటిలానే దూకుడుగా, నిలకడగా ఆడే సత్తా ఉంటుందా? అని జాతీయ సెలక్షన్ కమిటీ ఆలోచన చేస్తుంది. వారిద్దరూ ఆడగలరు అని అనుకుంటేనే వారు 2027 వరల్డ్ కప్‌లో ఆడుతారని, లేనిపక్షంలో వరల్డ్ కప్‌కు దూరమవుతారన్నారు. 
 
అయితే, తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మరోలా ఉంటుందన్నారు. నిజాయితీగా చెప్పాలి అంటే నా అంచనా ప్రకారం రోహిత్, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడలేరు. కానీ, ఎవరికి తెలుసు.. ఒకవేళ బాగా ఆడుతూ అప్పటికీ కూడా సెంచరీలు మీద సెంచరీలు చేస్తే మాత్రం వారిని ఆ భగవంతుడు కూడా టీమ్ నుంచి తొలగించలేరు" అని సునీల్ గవాస్కర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

తర్వాతి కథనం
Show comments