Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు సంవత్సరాల జీతం విరాళమిచ్చిన గౌతమ్ గంభీర్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:30 IST)
దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు సహాయంగా ప్రధాని సహాయనిధికి తన రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా గౌతం గంభీర్ ప్రకటించారు.
 
''మనకు ఈ దేశం ఏం చేసిందని అందరూ ప్రశ్నిస్తుంటారు. కానీ, మనం దేశానికి ఏం చేశామన్నది నిజమైన ప్రశ్న. తన రెండు సంవత్సరాల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. ఈ మంచి పని కోసం మీరు ముందుకు రావాలని గంభీర్ ట్వీట్ ద్వారా పిలుపు నిచ్చారు.
 
గంభీర్‌తో పాటు ఇప్పటికే పలువురు క్రీడాకారులు, సెలబ్రిటీలు.. ఈ వైరస్‌పై పోరాటానికి సహాయార్థం తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించగా, మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేదల కోసం రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని విరాళంగా ఇచ్చాడు. సురేశ్ రైనా రూ. 52 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments