Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు సంవత్సరాల జీతం విరాళమిచ్చిన గౌతమ్ గంభీర్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:30 IST)
దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు సహాయంగా ప్రధాని సహాయనిధికి తన రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా గౌతం గంభీర్ ప్రకటించారు.
 
''మనకు ఈ దేశం ఏం చేసిందని అందరూ ప్రశ్నిస్తుంటారు. కానీ, మనం దేశానికి ఏం చేశామన్నది నిజమైన ప్రశ్న. తన రెండు సంవత్సరాల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నానని తెలిపారు. ఈ మంచి పని కోసం మీరు ముందుకు రావాలని గంభీర్ ట్వీట్ ద్వారా పిలుపు నిచ్చారు.
 
గంభీర్‌తో పాటు ఇప్పటికే పలువురు క్రీడాకారులు, సెలబ్రిటీలు.. ఈ వైరస్‌పై పోరాటానికి సహాయార్థం తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించగా, మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ పేదల కోసం రూ. 50 లక్షల విలువైన బియ్యాన్ని విరాళంగా ఇచ్చాడు. సురేశ్ రైనా రూ. 52 లక్షలు, అజింక్య రహానే రూ. 10 లక్షల సాయం ప్రకటించాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా తన వంతు సాయం అందిస్తానని ముందుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments