Publish Date: Thu, 02 Apr 2020 (13:49 IST)
Updated Date: Thu, 02 Apr 2020 (13:59 IST)
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 2020 పరీక్షలు వాయిదా పడ్డాయి. మే చివరి వారంలో పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఏప్రిల్ 5 నుంచి 11వ తేదీ వరకు జరగాల్సి ఉంది. పరీక్షలు వాయిదా పడటంతో... తదుపరి డేట్లను బట్టి ఏప్రిల్ 15 తర్వాత అడ్మిట్ కార్డులను ఇష్యూ చేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేశారు. అప్పటి పరిస్థితిని బట్టి పరీక్ష తేదీని ప్రకటిస్తామని ఎన్టీఏ వెల్లడించింది.
పరిస్థితులను నిశితంగా గమనిస్తూనే వున్నామని.. విద్యార్థులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ను తెలియజేస్తామని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా నీట్ పరీక్షలను కూడా ఎన్టీఏ వాయిదా వేసింది. 15వ తేదీన పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఎన్టీఏ తదుపరి నిర్ణయాన్ని తీసుకోనుంది.