Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్‌కు గట్టి షాక్.. గాయంతో మార్క్ వుడ్ దూరం..

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (19:05 IST)
భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఓడిన ఇంగ్లాండ్.. మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమయం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ జట్టుకు షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్‌ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. 
 
రెండో టెస్టు నాలుగో రోజు ఆటలోనే గాయపడిన అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతోమూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. అయితే 31 ఏండ్ల మార్క్‌ వుడ్‌ జట్టుతోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని తెలిపింది.
 
మూడో టెస్ట్ అనంతరం అతనికి మరోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తామని అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్‌ నుంచి తప్పిస్తామని ఈసీబీ పేర్కొంది. భారత్ ఇంగ్లాండ్ ల మధ్య బుధవారం నుంచి మూడో టెస్ట్‌ ప్రారంభం కానుంది. 
 
ఇప్పటికే గాయాలతో బ్రాడ్, వోక్స్, అర్చర్ సేవలను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ఇది పెద్ద షాకే. అయితే గాయం కారణంగా దూరమైన వుడ్ స్తానంలో సకిబ్ మహ్మద్ టెస్టుల్లో అరంగ్రేటం చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

తర్వాతి కథనం
Show comments