Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే క్రికెట్‌లో మరో కొత్త రూల్ : ప్రతిపాదించిన ఐసీసీ

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (14:58 IST)
వన్డే క్రికెట్ మ్యాచ్‌లకు మరో కొత్త నిబంధనను అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావిస్తుంది. మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఒకే బంతిని వాడాలని ఐసీసీ తాజాగా ప్రతిపాదించింది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం వన్డే మ్యాచ్‌లో ఒక్కో ఎండో‌కు రెండు బంతులు చొప్పున నాలుగు కొత్త బంతులు వాడుతున్నారు. మ్యాచ్‌లో 25 ఓవర్ల తర్వాత బంతిని మారుస్తున్నారు. గతంలో మ్యాచ్ మొత్తం ఒకే బంతిని ఉపయోగించేవారు. దీనివల్ల బంతి పాతబడిన కొద్దీ బౌలర్లకు మరింత పట్టు లభించేది. 
 
రివర్స్ స్వింగ్‌తో పాటు స్పిన్నర్లకు కూడా బంతి అనుకూలించేది. ఈ రూల్ మార్చేశాక బ్యాటర్ల ఆధిపత్యం మొదలైంది. తాజాగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటి ఓ కీలక ప్రతిపాదన చేసింది. ఒక్కో ఎండ్‌లో కొత్త బంతి కాకుండా ఒక జట్టు ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు ఒకే బంతిని ఉపయోగించాలని సూచించింది. దీనిపై జింబాబ్వేలో జరుగనున్న ఐసీసీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments