Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత క్రికెట్ వన్డే జట్టులోకి ఇద్దరు కొత్త క్రికెటర్లు... ఇంగ్లండ్ బ్యాటింగ్

Advertiesment
ind vs eng

ఠాగూర్

, గురువారం, 6 ఫిబ్రవరి 2025 (16:01 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ సిరీస్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పర్యాటక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 33.3 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో సాల్ట్ 43, డక్కెట్ 32, రూట్ 19, బ్రూక్ 0, బట్లర్ 52 చొప్పున పరుగులు చేయగా, బెథెల్ 24, లివింగ్‌స్టోన్ 2 చొప్పున పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మోకాలి నొప్పితో బాధపడుతుండటంతో కోహ్లీ దూరంగా ఉన్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే, ఈ మ్యాచ్‌లో ఇద్దరు కొత్త ముఖాలకు చోటు కల్పించినట్టు చెప్పాడు. వారిలో యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణాలు ఉన్నారని చెప్పాడు. పేస్ బౌలింగ్‌ కోసం షమీ, రాణా, పాండ్యాలు, స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్ యావద్, అక్షర పటేల్‌లను తీసుకున్నట్టు రోహిత్ వివరించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డు ప్లెసిస్ సూపర్ క్యాచ్‌.. గాల్లోకి ఎగిరి అవుట్ చేశాడు..(video)