దేశంలో మళ్లీ 20 వేలుదాటిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:38 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా మరో 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువున నమోదవుతూ వచ్చిన ఈ కేసులు.. గడిచిన 24 గంటల్లో 20551గా నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,41,07,588కు చేరుకున్నాయి. వీటిలో 4,34,45,624 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, 526600 మంది మరణించారు. మరో 1,35,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
అదేవిధంగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కరోనా బాధితుల్లో 70 మంది చనిపోగా, మరో 21595 మంది కోలుకున్నారు. ఇకపోతే, రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.50గా ఉన్నాయి. మరణాలు 1.19 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 205.59 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను ఎవరో ఒకరు కాపాడండి: నటి గాయత్రి గుప్త ఎమోషనల్ వ్యాఖ్యలు

Chiranjeevi'158: ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన చిరంజీవి 158 చిత్రం

NBK112: నారా లోకేష్ అతిథిగా నందమూరి బాలకృష్ణ 112 చిత్రం

Tej Sajja: హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్ : సాయి దుర్గ తేజ్

Allani Sridhar: పిల్లల సినిమాలులేవనే బాధ వుంది;.ఏఐ టెక్నాలజీ 24 క్రాఫ్ట్స్‌ని కిల్‌ చేయదు : అల్లాణి శ్రీధర్‌

తర్వాతి కథనం
Show comments