Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మళ్లీ 20 వేలుదాటిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:38 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా మరో 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా 20 వేలకు దిగువున నమోదవుతూ వచ్చిన ఈ కేసులు.. గడిచిన 24 గంటల్లో 20551గా నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,41,07,588కు చేరుకున్నాయి. వీటిలో 4,34,45,624 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, 526600 మంది మరణించారు. మరో 1,35,364 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
అదేవిధంగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కరోనా బాధితుల్లో 70 మంది చనిపోగా, మరో 21595 మంది కోలుకున్నారు. ఇకపోతే, రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.50గా ఉన్నాయి. మరణాలు 1.19 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 205.59 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments