Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటుతో అన్న మృతి: అంత్యక్రియలకు వచ్చిన సోదరుడినీ కాటేసిన పాము

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (11:35 IST)
అన్నదమ్ములపై విధి పగపట్టిందా అనేట్లు ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాము కాటుకి అన్నయ్య చనిపోతే అతడి అంత్యక్రియలు చేసేందుకు వచ్చిన తమ్ముడిని కూడా పాము కాటు వేసింది. దీనితో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి.

 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భవానీపూర్‌కి చెందిన 38 ఏళ్ల అరవింద్ మిశ్రా మంగళవారం రాత్రి పాముకాటుకి గురయ్యాడు. చికిత్స అందించేలోపే కన్నుమూశాడు. సమాచారం అందుకున్న అతడి తమ్ముడు గోవింద మిశ్రా తన అన్నయ్య అంత్యక్రియలు చేసేందుకు వచ్చాడు. బుధవారం అంత్యక్రియలు పూర్తి చేసి ఇంట్లో నిద్రిస్తున్నాడు.

 
ఆ సమయంలో మరో పాము గోవింద మిశ్రాను కరిచింది. దీనితో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడితో పాటు మరో వ్యక్తిని కూడా కాటు వేసింది. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుందని వైద్యులు చెప్పారు. ఈ విషాదకర వార్త తెలుసుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యే కైలాస్ నాథ్ బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వ తరపున తగిన సాయం అందించి ఆదుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments