Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో కొత్తగా మరో 16 వేల కరోనా పాజిటివ్ కేసులు

covid19
, సోమవారం, 1 ఆగస్టు 2022 (11:21 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో హెచ్చు తగ్గుల్లో కనిపిస్తుంది. తాజాగా మరో 16 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16112 మంది ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, 39 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ప్రకటించిన కేసుల కంటే సోమవారం 3 మేరకు కేసులు తగ్గడం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసులు 1,43,989(0.33శాతం)కి చేరాయి. ఇప్పటివరకూ 4.40 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.48 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. 5.26 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అలాగే, ఆదివారం 8.34 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 204 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బారాముల్లాలో కాల్పులు.. ఎలైట్ అటాల్ట్ డాగ్ ఆక్సెల్‌కు నివాళులు