దేశంలో ఒక్కసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (12:52 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారి భారీగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 5,233 మందికి ఈ వైరస్ సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుద చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 2,771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ కారణంగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఈ వైరస్ నుంచి 3,345 మంది కోలుకున్నారు. 
 
గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెల్సిందే. సోమవారం 4 వేలకు దిగువున ఉండగా, మంగళవారం ఈ కేసుల సంఖ్య 5 వేలకు చేరింది. అదేసమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఇది ఆందోళనకు గురిచేస్తుంది. 
 
గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,13,361 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో 5,233 మందికి ఈ వైరస్ సోకింది. అంటే, సోమవారం 3,714 కేసులు నమోదు కాగా, మంగళవారం ఈ సంఖ్య 5,233గా ఉంది. అంటే పెరుగుదల శాతం 41 శాతానికి చేరింది. 
 
ఈ కొత్త కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. కేరళలో 2,271, మహారాష్ట్రలో 1,881 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం 1,881 కేసుల్లో ఒక్క ముంబైలోనే 2,271 కేసులు నమోదు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

Varma: పదహారేళ్ళ తర్వాత రీ రిలీజ్ కాబోతున్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర

తర్వాతి కథనం
Show comments