Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ ఎన్నికల తర్వాత పెట్రోల్ భారీ వడ్డన.. లీటరుకు రూ.3 వరకు పెంపు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:40 IST)
వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత దేశంలో మరోమారు పెట్రోల్, డీజల్ చార్జీలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 9 దశల్లో బెంగాల్ ఎన్నికలు జరుగుతుండగా, బుధవారం ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. 
 
లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ధర రూ.3 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ముడి చమురు సంస్థలకు వచ్చే నష్టాలను పూడ్చుకోవడానికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాల కథనం. కాగా, ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2వ తేదీన వెల్లడికానున్నాయి. 
 
ఇదిలావుంటే, ఈ యేడాదిలోనే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు 26 సార్లు పెంచేసింది. జనవరిలో 10 సార్లు, ఫిబ్రవరిలో 16 సార్లు పెంచింది. కానీ మార్చిలో ముచ్చటగా మూడుసార్లు, ఈ నెలలో ఇప్పటివరకు ఒకసారి వీటి ధరలు తగ్గించింది. చివరిగా ఫిబ్రవరి 27వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ నెల 16వ తేదీన చివరిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments