Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్రలతో కొట్టి, కారం చల్లి.. పెట్రోల్ పోసి కాల్చేశారు.. ఎక్కడ?

కర్రలతో కొట్టి, కారం చల్లి.. పెట్రోల్ పోసి కాల్చేశారు.. ఎక్కడ?
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (18:15 IST)
కృష్ణా జిల్లాలోని కంచికచెర్ల మండలం గనిఆత్కూరు రోడ్డులో అనుమానాస్పద రీతిలో మృతదేహం లభ్యమయింది. మృతుడు మూలపాడుకు చెందిన కొత్తపల్లి సాంబశివరావుగా గుర్తించారు.

మృతుడి ఒంటిపై పెట్రోల్ పోసి కాల్చిన గాయాలు వున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా అతనిని కర్రలతో కొట్టి, ఆ తర్వాత కారం చల్లిన ఆనావాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
 
గురువారం సాయంత్రం నుంచి సాంబశివరావు కనిపించలేదని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విటెరో టైల్స్‌: భారతదేశ వ్యాప్తంగా 56 నూతన షేడ్స్‌ ఆవిష్కరణ