Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కరోనా విజృంభణ : బ్యాంకు పని వేళలు కుదింపు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:34 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజుకు వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. దీంతో బ్యాంకుల పనివేళలను తగ్గించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్‌బీసీ) నిర్ణయించింది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ప్రతాపం చూపిస్తుండటం, స్టేట్ బ్యాంకు ఉద్యోగులు దాదాపు 600 మంది వైరస్ బారినపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సేవల్ని పరిమితం చేయాలని ఎస్ఎల్‌బీసీ యోచిస్తోంది.
 
అలాగే, బ్యాంకు విధులకు హాజరయ్యే సిబ్బందిని 50 శాతానికి పరిమితం చేయాలని కూడా నిర్ణయించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు బ్యాంకు వేళలను కుదించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదానికి పంపినట్టు తెలుస్తోంది. అనుమతి వస్తే రేపటి నుంచే కొత్త పనివేళలు అమల్లోకి వస్తాయి. 
 
అయితే బ్యాంకుల ప్రధాన కార్యాలయాల వేళల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. బ్యాంకు పనివేళలను కనుక తగ్గిస్తే ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మిషన్ల సహా ఇతర ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని ఎస్ఎల్‌బీసీ బ్యాంకర్లను ఆదేశించింది. కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరి సేవలకు మాత్రమే బ్యాంకులకు రావాలని వినియోగదారులకు సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments