Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ధరలు.. వెండి ధరలు పెరిగిపోయాయ్... బంగారం కొనాలనుకునే వారికి?

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:27 IST)
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపాయి. బంగారం కొనాలని భావించే వారికి దీంతో షాక్ తప్పలేదు. బంగారం ధర దూసుకెళ్లింది. ఈరోజు బంగారం ధర పైపైకి ఎగసింది. వెండి కూడా పైకి చేరింది. 
 
గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పరుగులు పెట్టింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.770 పెరుగుదలతో రూ.48,930కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.700 పెరుగుదలతో రూ.44,850కు చేరింది. 
 
బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.300 పెరుగుదలతో రూ.73,900కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments