Webdunia - Bharat's app for daily news and videos

Install App

14న రేణిగుంటలో బహిరంగ సభ... హాజరుకానున్న జగన్

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (19:20 IST)
ఈ నెల 14న ఏపీ సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నారు. రేణిగుంటలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. తిరుపతి ఉప ఎన్నిక బరిలో వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.
 
కాగా సీఎం జగన్ సభ కోసం రేణిగుంటలో ఎంపిక చేసిన స్థలాన్ని వైసీపీ మంత్రులు పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, టీటీడీ చైర్మన్, చిత్తూరు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి తదితరులు సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
 
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ రౌడీ రాజ్యం నడుపుతున్నాడని చంద్రబాబు ఆరోపిస్తున్నాడని, అదే నిజమైతే జగన్ కు ప్రజలు ఇంతలా బ్రహ్మరథం పట్టేవారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నాడు కాబట్టే స్థానిక ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పక్షాన నిలిచారని వెల్లడించారు. తిరుపతిలోనూ వైసీపీకి ఘనవిజయం ఖాయమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments