వదినతో అక్రమ సంబంధం పెట్టుకుంటావా? తమ్ముడిని చంపేసిన అన్నయ్య

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (15:57 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోయాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వదినతో అక్రమసంబంధం పెట్టుకున్న తమ్ముడిని ఓ అన్నయ్య వెంటాడి మరీ హతమార్చాడు. ఈ ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా, సాలూరు మండలం, కూనబందవలస గ్రామానికి చెందిన చొక్కాపు బోదయ్య.. అన్నయ్య చొక్కాపు కన్నయ్య భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కన్నయ్య భార్య, తల్లికి సమానమైన వదినతో బోదయ్య అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న అన్నయ్య తమ్ముడిని చంపేయాలనుకున్నాడు. అయితే బోదయ్య పని కోసం ఏలూరు వెళ్లి.. సంక్రాంతికి స్వగ్రామానికి రావడంతో కన్నయ్య ఆవేశంతో ఊగిపోయాడు. ఈ నెల 8వ తేదీ ఈ వ్యవహారంపై అన్నదమ్ముల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 
 
కానీ అప్పటికే తనతో తెచ్చుకున్న రాడ్డుతో బోదయ్య తల, ఇతర శరీర భాగాలతో కన్నయ్య దాడి చేశాడు. తీవ్రగాయాలతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై కన్నయ్య పోలీసులకు లొంగిపోయాడు. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకే బోదయ్యను హతమార్చినట్లు నేరాన్ని అంగీకరించాడు.. కన్నయ్య. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments