అపవిత్ర దోస్తి.. నేను ఉండలేను : మాజీ మంత్రి వట్టి వసంత కుమార్

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (10:25 IST)
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కటి కావాలని తీసుకున్న నిర్ణయం చాలా మంది కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 
 
గురువారం ఢిల్లీలో చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఒక్కటై స్నేహాస్తం అందిపుచ్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ రాజీనామా చేశారు. 
 
1983 నుంచి పోరాడుతున్న టీడీపీతో కాంగ్రెస్ కలవడం దారుణమని అన్నారు వట్టి. ఈ కలయికను ఎవరు జీర్ణించుకోలేరని.. ఇకపై తాను కాంగ్రెస్ పార్టీలో ఉండబోనని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం వట్టి వసంత కుమార్ ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ

Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ల పాట

Rajiv: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు లాంటి సిరీస్‌లో భాగమవ్వడం అదృష్టం : రాజీవ్ కనకాల

Sharva: హీరో శర్వా... బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్‌లలో రిలీజ్

Karthik Dandu: నాగ చైతన్య కి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా : కార్తీక్ దండు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments