అపవిత్ర దోస్తి.. నేను ఉండలేను : మాజీ మంత్రి వట్టి వసంత కుమార్

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (10:25 IST)
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కటి కావాలని తీసుకున్న నిర్ణయం చాలా మంది కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 
 
గురువారం ఢిల్లీలో చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఒక్కటై స్నేహాస్తం అందిపుచ్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ రాజీనామా చేశారు. 
 
1983 నుంచి పోరాడుతున్న టీడీపీతో కాంగ్రెస్ కలవడం దారుణమని అన్నారు వట్టి. ఈ కలయికను ఎవరు జీర్ణించుకోలేరని.. ఇకపై తాను కాంగ్రెస్ పార్టీలో ఉండబోనని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం వట్టి వసంత కుమార్ ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments