Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ పక్కన హాయిగా నిద్రపోతుంటే..? తొమ్మిదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి..?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (10:15 IST)
తొమ్మిదేళ్ల బాలికను అపహరించి.. కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంట్లో అమ్మ పక్కన ఆద మరచి నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల బాలికను కామాంధులు అపహరించారు. బాలికను కిడ్నాప్ చేయడమే కాకుండా.. ఇంట్లో దొరికిన సొత్తంతా ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా కవిసూర్యనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి దొయికొన గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. 
 
బాలికను చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్లిన ముగ్గురు.. ఇంట్లోని సొత్తును కూడా దోచుకున్నారు. సంఘటన సమయంలో బాధిత బాలిక కుటుంబ సభ్యులంతా ఒకేచోట పడుకుని ఉన్నారు. గురువారం వేకువజామున మేల్కొన్న బాలిక తల్లి.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనతో భర్తను నిద్ర లేపింది. అప్పటికే ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా పడిఉంది.
 
అల్మారాలో దాచిన రూ.20వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైందని గమనించిన బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-3లో జాన్వీ కపూర్ ఐటెమ్ సాంగ్ చేస్తే అదిరిపోద్ది.. డీఎస్పీ

సినీ నిర్మాతల గృహాల్లో ముగిసిన ఐటీ సోదాలు...

దిల్ రాజు ఆస్తులపై ఐటి దాడులు- వెంకటేష్ తో సినిమా ప్రచారం.. ఆంతర్యం?

Sai Pallavi :హైలెస్సో హైలెస్సా అంటూ ప్రేమలో జీవించిన నాగ చైతన్య, సాయి పల్లవి

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

తర్వాతి కథనం
Show comments