Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సోంలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు యువకుల కాల్చివేత

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (09:20 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సోంలో వేర్పాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఒకరి తర్వాత మరొకరిపై తుపాకులతో కాల్పులకు పాల్పడి హతమార్చారు. ఆ తర్వాత వారి శవాలను బ్రహ్మపుత్ర నదీ తీరంలో పడేసి వెళ్లిపోయారు. 
 
కాగా గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ ఐదుగురు యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. వారికోసం కుటుంబసభ్యులు గాలిస్తుండగా వారి మృతదేహాలు నదీ తీరంవద్ద ఉండటంతో తీవ్రంగా విలపించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టింది యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉగ్రవాదులేనని గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments