Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సోంలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఐదుగురు యువకుల కాల్చివేత

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (09:20 IST)
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సోంలో వేర్పాటు సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. ఖబారీ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఒకరి తర్వాత మరొకరిపై తుపాకులతో కాల్పులకు పాల్పడి హతమార్చారు. ఆ తర్వాత వారి శవాలను బ్రహ్మపుత్ర నదీ తీరంలో పడేసి వెళ్లిపోయారు. 
 
కాగా గురువారం రాత్రి సదియా పట్టణంలో ఓ షాపు ముందు కూర్చున్న ఈ ఐదుగురు యువకులను బ్రహ్మపుత్ర నదీ తీరంలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. వారికోసం కుటుంబసభ్యులు గాలిస్తుండగా వారి మృతదేహాలు నదీ తీరంవద్ద ఉండటంతో తీవ్రంగా విలపించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టింది యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఉగ్రవాదులేనని గుర్తించారు. ఇక ఈ ఘటనపై కేంద్ర హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని డీజీపీని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments