Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీలోకి మాజీలు

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (05:48 IST)
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీలోకి వలసలు పెరిగాయి. వివిధ పార్టీలకు చెందిన మాజీ నేతలు గంపగుత్తగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మంగళవారం ఒక్కరోజే సుమారు పదిమంది వైసీపీలో చేరారు. తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి పలువురు నేతలు వైసీపీలోకి వెళ్లారు.

మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రాజ్యసభ మాజీ సభ్యుడు సి.రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో కలిసి వచ్చారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి బాబూరావుకి కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. బాలకృష్ణ మీద ఉన్న అభిమానంతోనే ఇంతకాలం టీడీపీలో కొనసాగానని బాబూరావు చెప్పారు.

విశాఖపట్నంలో కాంగ్రెస్‌ నుంచి వైసీపీకి వెళ్లి అక్కడ నుంచి టీడీపీకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ తిరిగి వైసీపీ గూటికి చేరారు. ప్రజారాజ్యం నుంచి గాజువాక ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతలపూడి వెంకట్రామయ్య గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పెందుర్తి నుంచి పోటీ చేశారు.

ఆయన తాజా పరిణామాల్లో వైసీపీలో చేరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పసుపులేటి బాలరాజు గత ఎన్నికల్లో జనసేన పార్టీలోకి వెళ్లారు. తాజాగా ఆయన వైసీపీలో చేరారు. వీరంతా విశాఖ పార్టీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments