Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమాలపై ప్రశ్నిస్తే.. జైల్లో పెడుతున్నరు: కోదండ రాం

Webdunia
బుధవారం, 11 మార్చి 2020 (05:34 IST)
మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ను ఖండిస్తున్నట్లు తెజస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమేంటని ప్రశ్నించారు. ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ను తెజస ఖండిస్తున్నట్లు ఆ పార్టీ ఆధ్యక్షుడు ప్రొ. కోదండ రాం వెల్లడించారు.

ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినందుకు ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. ఐదేళ్లలో 60 వేలమంది ఉద్యోగ విరమణ చేశారని, ఖాళీ అయిన పోస్టులను ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేయలేదని కోదండరాం మండిపడ్డారు.

ఐదేళ్లలో కేవలం 35 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి నిరుద్యోగ సమస్య మా చేతుల్లో లేదని, దాన్ని తాము పరిష్కరించలేమని చెప్పడం అన్యాయమన్నారు.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా విధానం ఉందా..? అని కోదండ రాం ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments