Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్మికులకు కేసీఆర్ అభయ హస్తం : ఆర్టీసీ చార్జీల బాదుడు

Webdunia
శుక్రవారం, 29 నవంబరు 2019 (12:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభయహస్తం ఇచ్చారు. తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు అనుమతి ఇచ్చారు. అలా కార్మికులకు తీపి కబురు చెప్పిన కేసీఆర్... మరోవైపు, ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఫలితంగా ప్రయాణికులపై భారం పడనుంది. కిలోమీటరుకు 20 పైసలు చొప్పున చెంపుతామని, పెంచిన చార్జీలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. 
 
దీంతో ఆర్టీసీ బస్సులైన ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల సర్వీసుల చార్జీలు కిలోమీటరుకు 20 పైసల చొప్పున, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులకు ఫేర్‌ స్టేజీ ఆధారంగా చార్జీలు పెంచేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో బస్సు చార్జీలు పెంచారు. మూడేళ్ల తర్వాత ఇప్పుడే మళ్లీ చార్జీలు పెరగబోతున్నాయి. అప్పట్లో కిలోమీటరుకు 8 పైసల చొప్పున చార్జీలు పెంచగా... ఇప్పుడు కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెరగనున్నాయి. 
 
దీని ద్వారా ఆర్టీసీకి రూ.750 కోట్ల ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. 2016లో చార్జీలను పెంచినప్పుడు ఆర్టీసీకి రూ.200 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరింది. అంతకుముందు 2009లో ఒకసారి, 2013లో మరోసారి చార్జీలు పెరిగాయి. ఇప్పుడు కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంపుతో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల చార్జీలు భారీగా పెరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments